Sunday, February 22, 2026

సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ” బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టింది. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ “కపుల్ ఫ్రెండ్లీ” టీమ్ తో చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమా గురించి తన రెస్పాన్స్ తెలియజేస్తూ ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ప్రభాస్. ఇవన్నీ సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొట్టాయి. దీంతో “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాకు టికెట్ బుకింగ్స్ బాగా పెరిగాయి. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో ఈ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. సెకండ్ వీక్ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ క్రియేట్ చేయనుంది.

“కపుల్ ఫ్రెండ్లీ” చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు.

నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -