Sunday, March 22, 2026

ఐపీఎల్‌ 2021లో కరోనా రూల్స్‌తో పాటు కొత్త రూల్స్‌ కూడా!

క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021 మరో 11 రోజుల్లో ప్రారంభం కానుంది. కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికే బయోబబుల్, నో ఆడియన్స్ వంటి ప్రత్యేక రూల్స్ మధ్య బీసీసీఐ ఈ టోర్నీని నిర్వహించనుంది. అయితే వీటికి తోడు ఆటలోనూ మరికొన్ని సరికొత్త రూల్స్ చేర్చినట్లు తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ సారి ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ ఉండడానికి వీల్లేదు. మ్యాచ్ కచ్చితంగా 3 గంటల్లో ముగిసిపోవాల్సిందే. ఒక ఇన్నింగ్స్‌లో నిర్ణీత 20 ఓవర్లు 90 నిముషాల్లో పూర్తి చేయాల్సిందే. ఇంగ్లండ్‌-ఇండియా టీ20 అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ వల్ల స్కై అవుటైన తీరు అప్పట్లో దుమారం రేపింది. దీంతో ఈ విధానాన్ని కూడా ఈ ఐపీఎల్‌లో తొలగించారు. అనుమానాస్పద అవుట్‌ల విషయంలో డెసిషన్ పూర్తిగా థర్డ్ అంపైర్ చేతిలోనే ఉంటుంది.

ఇక గత ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌‌ విషయంలో షార్ట్ రన్ కూడా చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అందుకే ఈ టోర్నీలో కచ్చితంగా షార్ట్ రన్‌పై దృష్టి పెట్టాలని బీసీసీఐ అనుకుంటోంది. దానికోసం థర్డ్ అంపైర్‌కే ఈ బాధ్యత కూడా అప్పగించింది. ఇప్పటికే బౌలర్ వేసే ఫ్రంట్ ఫుట్ నోబాల్ విషయంలో థర్డ్ అంపైర్ ప్రతి బంతినీ చెక్ చేసేలా ఐసీసీ ఓ రూల్ తీసుకొచ్చింది.

గతంలో ఏదైనా మ్యాచ్‌ స్కోర్లు సమం అయితే ఓ సూపర్‌ ఓవర్‌ ఆడించేవారు. మళ్లీ టై అయితే.. ఇంకో ఓవర్, అలా విజేత తేలే వరకు ఓవర్లు పడుతూనే ఉండేవి. అయితే ఈ సారి ఆ విధానానికి స్వస్తి చెప్పారు. నిర్ణీత 20 ఓవర్ల కోటా అంటే 40వ ఓవర్‌ ఆఖరి బంతి ముగిసే సమయం నుంచి గంట లోపు సూపర్ ఓవర్లు పూర్తయిపోవాలి.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -