టీఆరెస్ మాజీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలు కొద్ది రోజులుగా విపరీతంగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు అధికారికంగా ఎప్పుడు చేరబోతున్నారనే విషయంపై ఇన్నాళ్లూ క్లారిటీ లేకపోవడంతో కొంత్త సందిగ్ధం నెలకొంది. ఇదే సమయంలో 13వ తేదీన ఆయన బీజేపీలో చేరతారని కూడా టక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఆయన 14న బీజేపీలో చేరబోతున్నారట. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు.
ఈటల రాజేందర్తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ కూడా కాషాయ పార్టీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. గురువారం జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్.. ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరతారని క్లారిటీ ఇచ్చారు.
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈటల రాజేందర్, పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ 14న బీజేపీలోకి వస్తారని బండి సంజయ్ తెలిపారు.